PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ప్రైవేట్​ ట్రావెల్స్​లో..23 కిలోల వెండి..

1 min read

– స్వాధీనం చేసుకున్న సెబ్​ పోలీసులు
పల్లెవెలుగు వెబ్​, కర్నూలు: రాష్ట్ర సరిహద్దు పంచలింగాల చెక్​ పోస్ట్ వద్ద సెబ్​ , సివిల్​ పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా.. ఓ ప్రైవేట్​ ట్రావెల్స్​లో ఇద్దరు వ్యక్తులు 23 కిలోల 252 గ్రాముల (130 వెండి నాణేలు) తరలిస్తుండగా పట్టుకున్నట్లు సెబ్​ సీఐ లక్ష్మి దుర్గయ్య తెలిపారు. హైదరాబాద్ నుండి కర్నూలు మీదుగా తమిళనాడు సేలంకు ఆరెంజ్ ప్రైవేట్ ట్రావెల్ బస్సులో సిద్ధేశ్​ కుమార్​, శరత్​ కుమార్​ అనే ప్రయాణికులను తనిఖీ చేయగా.. ఎటువంటి బిల్లులు, ఆధారాలు లేకుండా వెండి నాణేలను తరలిస్తున్నట్లు గుర్తించి.. స్వాధీనం చేసుకున్నారు.

About Author