PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

29న రాయచోటిలో అధికారిక ఇఫ్తార్ విందు:ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి

1 min read

పల్లెవెలుగు అన్నమయ్య జిల్లా రాయచోటి: అన్నమయ్య జిల్లా ఏర్పాటైన తర్వాత ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న అధికారిక ఇఫ్తార్ విందుకు ముస్లిం సోదరులు అందరూ హాజరు కావాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి కోరారు. ఈ నెల 29 న అనగా  శుక్రవారం సాయత్రం రాయచోటి పట్టణం చిత్తూరు – మదనపల్లె రింగ్ రోడ్డులో ఉన్న అభి కళ్యాణ మండపంలో జిల్లా కలెక్టర్, జేసి, ఎంపి, ఎం ఎల్ ఏలు, ఎం ఎల్ సి ల ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందును ఏర్పాటు చేస్తున్నట్లు శ్రీకాంత్ రెడ్డి తెలిపారు.జిల్లా ఏర్పాటైన మొదటి సారి నిర్వహిస్తున్న ఇఫ్తార్ విందులో రాయచోటిమరియు జిల్లా వ్యాప్తంగా ఉన్న ముస్లిం  సోదరులు పాల్గొనాలని శ్రీకాంత్ రెడ్డి  కోరారు..

About Author