PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ల‌క్ష ఉద్యోగాలు ఇవ్వ‌క‌పోతే పాస్ పోర్ట్ సీజ్ చేయండి !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో తాను లక్ష ఉద్యోగాలు ఇస్తానని, లేకుంటే త‌న‌ పాస్‌పోర్ట్‌ను సీజ్ చేసుకోండని కేఏ పాల్ అన్నారు. త‌నపై తెలంగాణ వ్యతిరేకి ముద్ర వేస్తున్నారని అన్నారు. సిరిసిల్ల రైతులకు అండగా నిలవడం తాను చేసిన తప్పా?, తనపై జరిగిన దాడి తెలంగాణ ప్రజల మీద జరిగిన దాడిగా అభివ‌ర్ణించారు. పీకే‌తో తాను టచ్‌లో ఉన్నానని తెలిపారు. అన్ని పార్టీలను కలపాలని సీఎం చెప్పినట్లు.. పీకే తనతో చెప్పాడని వెల్లడించారు. 150 దేశాలను వణికించి వచ్చానని, కేసీఆర్, కేటీఆర్‌లకు తాను బయపడేది లేదన్నారు. అన్ని పార్టీలకు సభలకు అనుమతులు ఇస్తున్నారు తనకు ఎందుకు అనుమతి ఇవ్వడం లేదు? అని ప్రశ్నించారు.

                                              

About Author