PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

షాంపూ ధ‌ర‌లూ పెరిగాయి !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ప‌్ర‌ముఖ ఎఫ్ఎంసీజీ కంపెనీ హిందూస్థాన్ యూనిలివ‌ర్ లిమిటెడ్ వివిధ ఉత్ప‌త్తుల ధ‌ర‌లు పెంచింది. కంపెనీ వేరియంట్లలో సన్‌సిల్క్ షాంపూ ధరలను రూ. 8-10 పెంచింది. 100-ఎం.ఎల్ క్లినిక్ ప్లస్ షాంపూ ధర 15 శాతం పెరగనుంది. హిందుస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్ తన వస్తువుల ధరలను 15 శాతం వరకు పెంచిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. పియర్స్ 125 గ్రాముల సబ్బు ధర 2.4 శాతం, మల్టీప్యాక్ 3.7 శాతం పెరిగాయి. లక్స్ సబ్బు కొన్ని మల్టీప్యాక్ వేరియంట్‌ల ధరలు 9 శాతం పెరిగాయి. గ్లో & లవ్లీ ధర 6-8 శాతం పెరిగింది. టాల్కం పౌడర్ ధర కూడా 5-7 శాతం పెరిగింది.

                                      

About Author