PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కొత్త ప్ర‌ధాని విక్ర‌మే సింఘే

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : శ్రీలంక తదుపరి ప్రధాన మంత్రిగా ఆ దేశ రాజకీయ దిగ్గజం రణిల్ విక్రమేసింఘే నియమితులయ్యారు. ఈ మేరకు అధ్యక్షుడు గొటబాయ రాజపక్స నిర్ణయం తీసుకున్నారు. 73 ఏళ్ల వయసున్న విక్రమే సింఘే ప్రధానిగా ప్రమాణస్వీకారం చేశారని ఆ దేశ రాష్ట్రపతి కార్యాలయ మీడియా పేర్కొంది. గొటబాయ రాజపక్స కూడా ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని నిర్ధారించారు. ‘‘ కొత్త ప్రధానమంత్రి విక్రమేసింఘేకు అభినందనలు. కష్టకాలంలో దేశాన్ని సవ్యమైన దిశలో నడిపిస్తారని ఆశిస్తున్నాను’’ అని ఆయన ఆకాంక్షించారు. కాగా విక్రమేసింఘే శ్రీలంకకు 5వ సారి ప్రధానిగా వ్యహరించనున్నారు.

                                          

About Author