PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వైసీపీ నేత‌ కొత్త‌ప‌ల్లి సుబ్బారాయుడి గ‌న్ మెన్లు తొల‌గింపు !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : వైసీపీ నేత, మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడికి ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఆయ‌న‌ గన్‌మెన్లను తొలగించింది. కాపు కార్పొరేషన్ చైర్మన్‌గా ఉన్న సమయంలో సుబ్బారాయుడికి 1+1 పద్ధతిలో గన్‌మెన్లను కేటాయించడం జరిగింది. ఇటీవల జిల్లా కేంద్రం విషయంలో ప్రభుత్వానికి, సొంత పార్టీకి సుబ్బారాయుడు ఎదురుతిరిగిన విషయం తెలిసిందే. రాజకీయ పరిణామాల నేపథ్యంలోనే గన్‌మెన్లను తొలగించారని వైసీపీ వర్గాల్లో ప్రచారం జోరుగా సాగుతోంది.

                         

About Author