NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

క‌ర్నూలు.. కానిస్టేబుళ్ల పై క్రిమిన‌ల్ కేసు !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : క‌ర్నూలు జిల్లా ఎస్పీ కీల‌క ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలోని మద్దికెర పోలీస్‌స్టేషన్‌లో పనిచేస్తున్న ఇద్దరు కానిస్టేబుళ్లు శ్రీరామ్ నాయక్, శేఖన్న, హోంగార్డ్‌ జహీర్‌పై క్రిమినల్ కేసులు నమోదు అయ్యాయి. మద్దికెరలో వైసీపీ నేత వాహనంలో రేషన్‌ బియ్యం తరలిస్తుండగా పోలీసులు పట్టుకుని వదిలేశారు. స్థానికుల ఫిర్యాదు మేరకు ఈ వ్యవహారంపై విచారణ చేసి కేసు నమోదు చేయాలని ఎస్పీ సుధీర్‌ కుమార్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.

                                  

About Author