PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పాకిస్థాన్ లో హిందువుల జ‌నాభా ఎంతంటే ?

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : పాకిస్తాన్‌లో 22,10,566 మంది హిందువులు నివసిస్తున్నట్లు ఓ నివేదిక వెల్లడించింది. దేశంలో నమోదైన మొత్తం 18,68,90,601 మంది జనాభాలో మైనారిటీ హిందువుల వాటా 1.18% మాత్రమేనని సెంటర్‌ ఫర్‌ పీస్‌ అండ్‌ జస్టిస్‌ పాకిస్తాన్‌ వెల్లడించిన నివేదిక పేర్కొంది. దేశ జనాభాలో మైనారిటీల వాటా 5% కాగా, వీరిలో హిందువులే అత్యధికులని ఈ నివేదిక ఉటంకించింది. దేశంలో 1,400 మంది నాస్తికులు సహా 17 వేర్వేరు మతాలు, ఆచారాలను గుర్తించినట్లు మార్చిలో వెల్లడించిన ఎన్‌ఏడీఆర్‌ఏ డేటా పేర్కొంది. హిందూ జనాభాలో 95% మంది సింధ్‌ ప్రావిన్స్‌లోనే నివసిస్తున్నారంది.

                                                        

About Author