PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అస‌దుద్దీన్ ఒవైసీకి కృత‌జ్ఞ‌త‌లు తెలిపిన బీజేపీ ఎంపీ !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : నిరుద్యోగంపై తాను అందించిన డేటా ఆధారంగా పార్లమెంట్‌లో ప్రశ్నలు లేవనెత్తినందుకు ఏఐఎంఐఎం అధినేత ఓవైసీకి అసదుద్దీన్ ఓవైసీకి భారతీయ జనతా పార్టీ నేత, పిలిబిట్ ఎంపీ వరుణ్ గాంధీ కృతజ్ఞతలు తెలిపారు. ఒకానొక సందర్భంలో వరుణ్ గాంధీ చెప్పిన ఈ లెక్కల్ని ఓవైసీ ఒక్కొక్కటిగా పార్లమెంట్‌లో ప్రస్తావించారు. అంతే కాకుండా ఈ డేటాను బీజేపీ నేత వరుణ్ గాంధీయే షేర్ చేశారంటూ పలుమార్లు పేర్కొన్నారు. కాగా, ఓవైసీ ప్రసంగానికి సంబంధించిన వీడియోను వరుణ్ గాంధీ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేస్తూ ‘‘నిరుద్యోగం నేడు దేశంలో అతిపెద్ద సమస్య. ఈ సమస్యపై ప్రభుత్వంపై దృష్టిసారించేలా యావత్ దేశ నాయకులు సహకరించాలి. నిరుద్యోగ యువతకు న్యాయం జరిగినప్పుడే ఈ దేశం శక్తివంతం అవుతుంది’’ అని ట్వీట్ చేశారు.

                                                  

About Author