PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మోదీకి కేసీఆర్ సూటి ప్ర‌శ్న‌లు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ప‌్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీకి తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ కీల‌క ప్ర‌శ్న‌లు సంధించారు. హైద‌రాబాద్ వ‌స్తున్న మోదీ త‌న ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం చెప్పాలంటూ కోరారు. ‘‘ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు ఒక్కటైనా పూర్తి చేశారా?.. చేస్తే ఏం చేశారో చెప్పండి?… నేను కాదు ప్రజలు అడుగుతున్నారు. దేశంలో రైతుల భాగస్వామ్యం చాలా పెద్దది. వారి ఆదాయం డబుల్ చేస్తాం అన్నారు…చేయలేదు. కానీ ఖర్చు మాత్రం డబల్ అయింది. ఢిల్లీ ఆందోళనలో మృతి చెందిన రైతు కుటుంబాలకు మేము సహాయం చేస్తే కూడా అవహేళన చేస్తున్నారు దేశ రైతులు బంగారం అడగడం లేదు, మద్దతు ధర అడుగుతున్నారు. ముందు ముందు ఇక మీ ఆటలు సాగవు. మోదీ కంటే ముందు చాలా మంది ప్రధానులు పనిచేశారు. ఎవరు శాశ్వతం కాదు’’ అంటూ సీఎం కేసీఆర్ వ్యాఖ్యలు చేశారు.

                                                   

About Author