PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

భార్య‌భ‌ర్త‌ల వ‌ద్ద 45 పిస్తోళ్లు !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : రెండు ట్రాలీ బ్యాగుల్లో పిస్తోళ్లు తీసుకొని వస్తు న్న ఇద్దరిని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్ట మ్స్‌ అధికారులు అరెస్టు చేశారు. భారాభర్తలు అయిన జగజిత్‌ సింగ్‌, జస్విందర్‌ కౌర్‌ నుంచి 45 పిస్తోళ్లను స్వాధీనం చేసుకున్నారు. వాటి ఖరీదు రూ.22.50 లక్షలు ఉంటుందని అంచనా. కేసును నేషనల్‌ సెక్యూరిటీ గార్డ్స్‌లోని కౌంటర్‌ టెర్రరిజమ్‌ విభాగం విచారణకు స్వీకరించింది. ఫ్రాన్స్‌లోని పారిస్‌ నుంచి బయల్దేరిన నిందితులు వియత్నాం మీదుగా జూలై 10న భారత్‌కు వచ్చారు. వీరు వియత్నాంలో దిగినప్పుడు జగజిత్‌ సింగ్‌ సోదరుడు మన్‌జిత్‌ సింగ్‌ ఆయనకు పిస్తోళ్లు ఉన్న బ్యాగులను అందజేశాడు.

                                                  

About Author