PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

బీజేపీకి ఝ‌ల‌క్ !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : మధ్యప్రదేశ్‌ మునిపల్‌ ఎన్నికల్లో అధికార బీజేపీకి షాక్‌ తగిలింది. రాష్ట్రంలోని 16 నగర పాలక సంస్థలకుగాను తొలిరౌండ్‌లో ఎన్నికలు నిర్వహించిన 11 కార్పొరేషన్లలో ఏడింటిని మాత్రమే కమలం పార్టీ నిలబెట్టుకోగలిగింది. కాంగ్రెస్‌ పార్టీ మూడు కార్పొరేషన్లను దక్కించుకొని సత్తా చాటింది. ఆమ్‌ ఆద్మీ పార్టీ కూడా ఒక కార్పొరేషన్‌ను దక్కించుకుని ఉనికి చాటుకుంది. గత ఎన్నికల్లో రాష్ట్రంలోని మొత్తం 16 కార్పొరేషన్లనూ బీజేపీయే గెలుచుకోవడం గమనార్హం. ఈ ఫలితాలు కాంగ్రెస్‌కు ప్రజల్లో పెరుగుతున్న ఆదరణకు నిదర్శనమని ఆ పార్టీ నేత కమల్‌నాథ్‌ అన్నారు.

                                        

About Author