PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఆయ‌న శాడిస్టు కాబ‌ట్టే న్యూడిస్టుల‌ను వెన‌కేసుకొస్తున్నాడు !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : జగన్‌ శాడిస్టు కాబట్టే గోరంట్ల మాధవ్‌ లాంటి న్యూడిస్టులను ప్రోత్సహిస్తున్నాడని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కావలి గ్రీష్మ విమర్శించారు. ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ ‘శ్రావణ శుక్రవారం వరలక్ష్మీ వ్రతం రోజున రాష్ట్ర మహిళలు అమ్మవారిని పూజిద్దామనుకుంటే.. అష్ట దరిద్రపు వీడియో దర్శనమిచ్చింది. 75వ స్వాతంత్య్ర దినోత్సవం వస్తోందని సంతోషిద్దామంటే.. గోరంట్ల గబ్బు పట్టించాడు. ఇది తెలుగు వారికి జగన్‌ ఇచ్చిన గిఫ్ట్‌ అనుకోవాలేమో? వైసీపీ నాయకులకు సిగ్గూఎగ్గూ, మానం, మర్యాద ఏమీ లేవు. మాధవ్‌ తప్పు చేశాడని వైసీపీలో ఒక్కరూ చెప్పడం లేదు. వారిలో పశ్చాత్తాప భావనే లేదు’ అంటూ విమర్శించారు.

                                         

About Author