PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

జ‌వ‌హ‌ర్ లాల్ నెహ్రూను టార్గెట్ చేస్తూ బీజేపీ వీడియో !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : దేశ విభజనపై.. భారత ప్రథమ ప్రధాని పండిట్‌ జవహర్‌లాల్‌ నెహ్రూను టార్గెట్‌గా చేసుకుని బీజేపీ ఓ వీడియో విడుదల చేసింది. అడ్డంగా విభజన చేస్తుంటే.. నెహ్రూ చూస్తూ కూర్చున్నారని పరోక్షంగా ఆ వీడియోలో ఆరోపించింది. విభజనకు ముస్లింలీగ్‌ నేత మహమ్మద్‌ అలీ జిన్నా చేసిన డిమాండ్‌కు నెహ్రూ తలొగ్గారని విమర్శించింది. ఆగస్టు 14ను ‘దేశ విభజన భయోత్పాత – సంస్మరణ దినం’గా జరుపుకోవాలని గత ఏడాది ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. దేశ విభజన నేపథ్యంలో జరిగిన హిందువుల ఊచకోత, వారి త్యాగాలు, ఎందరెందరో ఇబ్బందులు పడిన తీరును భావితరాలు గుర్తెరగాలని ఆయన ఆ సందర్భంలో వ్యాఖ్యానించారు.

                              

About Author