PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

`మా డాడీని చూస్తే మోడీకి టెన్ష‌న్ `

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : టీఆర్ఎస్ అగ్రనేత, ఎమ్మెల్సీ కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. లిక్కర్ కుంభకోణంలో బీజేపీ తన పేరు లాగడాన్ని ప్రస్తావిస్తూ.. బీజేపీ అసలు టార్గెట్ తాను కాదని, కేసీఆరే వాళ్ల టార్గెట్ అని అన్నారు. కేసీఆర్‌తో తమకు ముప్పు తప్పదని బీజేపీ గ్రహించిందని, అందుకనే కేంద్ర దర్యాప్తు సంస్థలను ఉసి గొల్పుతోందని అన్నారు. తన తండ్రిని చూస్తే ప్రధాని మోదీకి టెన్షన్ అని, అందుకే ఇలాంటి పిచ్చిపిచ్చి ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. బీజేపీవి అన్నీ బ్యాక్ డోర్ డోర్ పాలిటిక్స్ అని విమర్శించారు. యుద్ధంలో రాజును ఓడించాలంటే తొలుత చుట్టూ ఉన్న వారిని కొడతారని, బీజేపీ కూడా ఇప్పుడు అదే చేస్తోందన్నారు.

                                     

About Author