PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అనంతపురంలో…‘బెల్​’ రక్షణ రంగ ఉత్పత్తుల ఫ్యాక్టరీ ఏర్పాటుపై చర్చ

1 min read

పల్లెవెలుగు వెబ్​:అనంతపురం జిల్లా పాలసముద్రం దగ్గర భారత ఎలక్ర్టానిక్​ లిమిటెడ్​కు చెందిన రక్షణ రంగ ఉత్పత్తులను తయారు చేసే ఫ్యాక్టరీ ఏర్పాటు, అనుమతులపై గురువారం బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ కార్యదర్శి డా. పార్థసారధి వాల్మీకి ఏపీఐఐసీ చైర్మన్​తో చర్చలు జరిపారు. ఫ్యాక్టరీ ఏర్పాటుతో నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించినవారమవుతామన్నారు. అంతేకాక ఫ్యాక్టరీ ఏర్పాటుకు పాలసముద్రం అనుకూలంగా ఉన్నట్లు వెల్లడించారు. రాష్ట్రాలను పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఫ్యాక్టరీల ఏర్పాటుకు సిద్ధంగా ఉందన్నారు.  అందులో భాగంగా అనంతపురం జిల్లా పాలసముద్రం దగ్గర భారత రక్షణ రంగ ఉత్పత్తుల ఫ్యాక్టరీ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటుందని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ కార్యదర్శి డా. పార్థసారధి వాల్మీకి స్పష్టం చేశారు.

About Author