PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

దేశ విచ్ఛిన్నానికి కుట్ర

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : కుల, మత ప్రాతిపదికన చిచ్చు రగిల్చి దేశాన్ని ముక్కలు చేయడానికి మతతత్వ శక్తులు కుట్ర పన్నాయని కాంగ్రెస్‌ అగ్ర నేత రాహుల్‌గాంధీ ఆరోపించారు. ప్రస్తుతం జాతీయ పతాకం ప్రమాదంలో ఉందని, దానిపై బీజేపీ, రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌ దాడిచేస్తున్నాయని ధ్వజమెత్తారు. దేశంలోని ప్రతి వ్యవస్థపైనా దాడి జరుగుతోందని.. ఈ నేపథ్యంలో ఆయా శక్తులను తరిమికొట్టి.. దేశాన్ని సమైక్యంగా ఉంచేందుకే ‘భారత్‌ జోడో’ పాదయాత్ర చేపట్టానని తెలిపారు. ఈ కృషిలో తనకు మద్దతివ్వాలని ప్రజలకు పిలుపిచ్చారు.

                                          

About Author