PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఎన్నిక‌ల్లో గాంధీలెవ‌రూ ఉండ‌రు !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి రేసులో అందరికంటే ముందు ఉన్న రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ శుక్ర‌వారం ఓ కీలక విషయాన్ని వెల్లడించారు. పార్టీ అధ్యక్ష పదవికి జరుగుతున్న ఎన్నికల్లో గాంధీ కుటుంబానికి చెందిన వారెవరూ పోటీలో ఉండబోరని ఆయన వెల్లడించారు. ఈ విషయాన్ని స్వయంగా రాహుల్ గాంధే తనతో చెప్పారని గెహ్లాట్ తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టాలన్న డిమాండ్ల నేపథ్యంలో మొన్న సోనియా గాంధీతో భేటీ అయిన గెహ్లాట్… ఆ మరునాడే కేరళ వెళ్లి భారత్ జోడో యాత్రలో పాల్గొంటున్న రాహుల్ గాంధీతో సమావేశమైన సంగతి తెలిసిందే.

                                                   

About Author