NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి పై కేసు న‌మోదు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్: తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి పై పోలీసులు కేసు నమోదు చేశారు. 30 యాక్ట్ అమలులో ఉన్న టౌన్ పోలీస్ స్టేషన్ ఎదుట అనుమతి లేకుండా బైటాయించి చట్ట విరుద్ధంగా నిరసన తెలిపారంటూ, విధులకు ఆటంకం కలిగించారంటూ ప్రభాకర్ రెడ్డితోపాటు 120 మందిపై కేసు నమోదు చేశారు. టీడీపీ కౌన్సిలర్లపై వైసీపీ నేతల దాడులను నిరసిస్తూ జేసీ ప్రభాకర్ రెడ్డి తన అనుచరులతో పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ధర్నా చేపట్టారు. అనుమతులు లేకుండా ఆందోళనకు దిగి ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించారంటూ పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ చైతన్య తెలిపారు.

                                          

About Author