PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పరిసరాల పరిశుభ్రతతో ఆరోగ్యం పదిలం

1 min read

పల్లెవెలుగు, వెబ్​ రుద్రవరం: పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా ఆరోగ్యం పదిలంగా ఉంటుందని వైద్యాధికారి గాయత్రి తెలిపారు. స్వచ్ఛ హీ సేవా సంకల్పంలో భాగంగా రుద్రవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని కోటకొండ పెద్దకంబలూరు రుద్రవరం గ్రామాలలో వైద్య సిబ్బంది ఫ్రైడే డ్రై డే కార్యక్రమాలు నిర్వహించి పరిసరాల పరిశుభ్రత ఆరోగ్యం పై తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. గ్రామాలలోని ఇళ్ల వద్దకు వెళ్లి ప్లాస్టిక్ డ్రమ్ములు తదితర వాటిలలో నీటి నిల్వలు ఎక్కువ రోజులు ఉంచుకోవడం ద్వారా వచ్చే సమస్యలపై ప్రజలకు అవగాహన కల్పించారు కాలనీలలో పారిశుధ్యం పనులు చేయించారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది ఏఎన్ఎంలు ఆశా కార్యకర్తలు సచివాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

About Author