PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

గృహ నిర్మాణాలు వేగవంతం చేయాలి

1 min read

పల్లెవెలుగు, వెబ్​ రుద్రవరం: మండలంలో నాలుగు గ్రామాలలో కూడా పథకం కింద చేపడుతున్న గృహ నిర్మాణాలను వేగవంతం చేయాలని ఎంపీడీవో మధుసూదనరెడ్డి హౌసింగ్ అధికారులు సచివాలయం సిబ్బందికి సూచించారు. మండలంలోని పేరూరు గ్రామంలో శుక్రవారం అధికారులు సందర్శించారు. సందర్భంగా నూతన సచివాలయం రైతు భరోసా కేంద్రం వెల్నెస్ సెంటర్ లబ్ధిదారులు చేపడుతున్న గృహ నిర్మాణాలను పరిశీలించారు. ప్రభుత్వ భవన నిర్మాణాలతో పాటు లబ్ధిదారులు చేపడుతున్న గృహ నిర్మాణాలను వేగవంతం చేయాలని సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ ఏఈ వెంకట రాముడు ఏవో వరలక్ష్మి గ్రామ సర్పంచ్ దేవదానం వైసీపీ నాయకుడు తిరుపతిరెడ్డి పంచాయతీ కార్యదర్శులు ప్రభాకర్ శిరీష ఇంజనీరింగ్ అసిస్టెంట్ మహేష్ సచివాలయం సిబ్బంది తదితరులు ఉన్నారు.

About Author