PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కేంద్ర మంత్రిని కలిసిన చోడగిరి శ్రీనివాస్

1 min read

పల్లెవెలుగు, వెబ్​ ఏలూరు : ఏలూరు జిల్లాలో వివిధ కార్యక్రమాల్లో భాగంగా విచ్చేసిన కేంద్ర మంత్రి వర్యులు జి కిషన్ రెడ్డి ని మర్యాద పూర్వకంగా ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ఏపీఎన్జీవో సంఘం అధ్యక్షుడు చోడగిరి శ్రీనివాస్ మరియు మాజీ అధ్యక్షుడు ఆర్.ఎస్ హరనాధ్.వారిని మర్యాదపూర్వకంగా కల్సి పుష్పగుచ్చం ఇచ్చి అభినందించారు,ఎన్జీవో సంఘం నాయకులు.ఇటీవల జరిగిన ఎన్జీవో సంఘ ఎన్నికల్లో అధ్యక్షుడు గా చోడగిరి శ్రీనివాస్ ఎన్నికైన సందర్భంగా కేంద్ర మంత్రి వర్యులు కిషన్ రెడ్డి శ్రీనివాస్ ని శాలువాతో సత్కరించి పుష్పగుచ్ఛం ఇచ్చి అభినందించారు.ఉద్యోగుల సమస్యల పట్ల స్పందించి మీరు చేస్తున్న కృషి అభినందనీయమని వారికి రావాల్సిన ప్రయోజనాలు సకాలంలో వచ్చేలా నాయకులు కృషి చేయాలని కిషన్ రెడ్డి సూచించారు.ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, చిన్న నాటి మిత్రులు.రాష్ట్ర బీజేపీ కార్యదర్శి భూపతి రాజు శ్రీనివాస వర్మ.బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షరాలు బొల్లిన నిర్మల,ఏలూరు పార్లిమెంట్ ఇంచార్జి కారంకి శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

About Author