PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఏపీలో భారీగా బంగారం పట్టివేత

1 min read

పల్లెవెలుగువెబ్ : ఏపీలో భారీగా బంగారం పట్టుబడింది. ఒక్కరోజే కస్టమ్స్ ఆపరేషన్‌లో రూ.11 కోట్లు విలువైన బంగారం, నగదు స్వాధీనం చేసుకున్నారు. 20 బృందాలుగా ఏర్పడి కస్టమ్స్ అధికారుల ఆపరేషన్ నిర్వహించారు. ఆర్టీసీ బస్సులు, కార్లు, రైళ్లలో గోల్డ్ స్మగ్లింగ్ చేస్తున్నట్టు గుర్తించారు. విశాఖ, నెల్లూరు, ఏలూరు, కాకినాడ, సూళ్లూరుపేట, చిలకలూరిపేటలో భారీగా బంగారం పట్టుబడింది. రూ.6.7 కోట్లు విలువైన 13.189 కిలోల బంగాన్ని సీజ్‌ చేశారు. బంగారంతో పాటు 4.24 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్న అధికారులు నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు.

About Author