PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఆరు గ్రామాలలో ఆధార్ సేవలు

1 min read

పల్లెవెలుగు, వెబ్​ మిడుతూరు: మిడుతూరు మండలంలోని గ్రామాలలో రోజుకొక గ్రామం చొప్పున ఆధార్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఎంపీడీవో జిఎన్ఎస్ రెడ్డి తెలిపారు.ఆధార్ కేంద్రాల్లో 6 రకాల సేవలను అందించనున్నట్లు అదేవిధంగా కొత్తగా ఎన్రోల్మెంట్ చేసుకొనుట, చిరునామా మరియు మొబైల్ నెంబర్ మార్చుట, బయోమెట్రిక్ తదితర వాటి సేవలను అందించ నున్నట్లు తెలిపారు.గ్రామాల వారీగా ఆధార్ సేవలు జరుగు తేదీలు:ఈనెల 25న చెరుకుచెర్ల, 26న మిడుతూరు, 27న కడుమూరు, 28న నాగలూటి, 29న చింతలపల్లి, 31న జలకనూరు ఈగ్రామాలలో జరిగే ఆధార్ సేవలను ఆయా గ్రామాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎంపీడీఓ తెలిపారు.

About Author