NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

యాత్రకు సహకరించిన జిల్లా ఎస్పీకి కృతజ్ఞతలు

1 min read

పల్లెవెలుగు, వెబ్ కర్నూలు: ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాలో జాతీయ కాంగ్రెస్ యువ నాయకులు శ్రీ రాహుల్ గాంధి గారు చేపట్టిన భారత్ జోడో యాత్రకు జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ గారికి మరియు జిల్లా పోలీసు బృందంకు, ప్రత్యేక బందొస్తును, ప్రత్యేక భద్రతను ఏర్పాటు చేసి, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ఎలాంటి ఆటంకం ఇబ్బంది లేకుండా యాత్రకు సహకరించి ఏర్పాట్లు చేసిన జిల్లా ఎస్పీ గారికి, మరియు జిల్లా పోలీస్ బృందానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నట్లు ఎన్ ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీ పాణ్యం నియోజకవర్గ ఇన్చార్జ్ నాగమధు యాదవ్ ఆధ్వర్యంలో మంగళవారం ఎస్పీగారి కార్యాలయంలో జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ గారిని కలిసి శాలువా తో సత్కరించి, పుష్పగుచ్చం అందజేసి, ప్రత్యేకంగా వారికి ధన్యవాదములు తెలియజేశారు. ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ ఎ చిన్నపాటి సమస్య లేకుండా, భారత్ జోడో యాత్ర ఆంధ్రప్రదేశ్ నుంచి కర్ణాటకలోకి వెళ్ళే దాకా సజావుగా జరిగిందని, సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లాల అధ్యక్షులు వీరేష్ యాదవ్, శ్రీనివాస్, రాష్ట్ర కార్యదర్శి మహేశ్వరయ్య, వెంకటేష్, ఠాగూర్, సాయి తదితరులు పాల్గొన్నారు.

About Author