PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సంక్షేమ పథకాలు అందించడమే జగనన్న లక్ష్యం

1 min read

– జిల్లా పరిషత్ చైర్మన్ ఆకేపాటిఅమరనాధ్ రెడ్డి
పల్లెవెలుగు, వెబ్​ అన్నమయ్య జిల్లా వీరబల్లి: రాష్ట్రంలో అర్హత ఉన్న ప్రతీ పేదవాడికి సంక్షేమ పథకాలు అందించడమే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి లక్ష్యమని జడ్పీ ఛైర్మన్ ఆకేపాటి అమరనాథ రెడ్డి గారు పేర్కొన్నారు. శుక్రవారం వీరబల్లె మండల కేంద్రంలో మండలాధ్యక్షులు గాలివీటి రాజేంద్రనాథరెడ్డి గారి అధ్యక్షతన జరిగిన మండల సర్వసభ్య సమావెసానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూరాష్ట్రంలో సంక్షేమ పాలన నడుస్తోందని ప్రతి కుటుంబం ఏడాదికి యాభై వేల నుండి మూడులక్షల వరకూ ఆర్థిక లబ్ధి పొందుతోందని సంక్షేమ పథకాలు అందని పేద కుటుంబం అంటూ రాష్ట్రంలో ఏదీ లేదని,కులమూ మతమూ పార్టీ చూడకుండా అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందించిన ప్రభుత్వం మన ప్రభుత్వమే అన్నారుఈ కార్యక్రమం లో మండల అధికారులు ,జడ్పీటీసీ శివరాం, మండల ఉపాధ్యక్షులు ఎంపీటీసీలు,వివిధ గ్రామాల సర్పంచ్ లు తదితరులు పాల్గొన్నారు.

About Author