PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సరైన నాయకుడిని ఎన్నుకోకపోతే ఐదేళ్లు నష్టపోతారు

1 min read

–నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జి టి.జి భరత్

పల్లెవెలుగు, వెబ్​ కర్నూలు: తెలుగుదేశం ప్రభుత్వానికి, వైసీపీ ప్రభుత్వానికి తేడా ఏంటో తెలుసుకోవాలని కర్నూలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జి టి.జి భరత్ ప్రజలకు సూచించారు. సోమవారం నగరంలోని 16వ వార్డులో సభ్యత్వం నమోదు కార్యక్రమంతో పాటు ఒక్క రోజు అన్న క్యాంటిన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ పార్లమెంటు అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లుతో కలిసి టిజి భరత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా టి.జి భరత్ మాట్లాడుతూ రాష్ట్రాన్ని ఎలా అభివ్రుద్ది చేయాలో చంద్రబాబుకు తెలుసన్నారు. పేదవారికి ఎంతో ఉపయోగపడే అన్న క్యాంటిన్లను కొనసాగించకపోవడం దురద్రుష్టకరమన్నారు. ఈ ప్రభుత్వం పేరుమార్చయినా అన్న క్యాంటిన్లను కొనసాగించాల్సి ఉండేదన్నారు. ఇక టిడిపి సభ్యత్వం తీసుకోవడం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉంటాయన్నారు. ఎన్నికల సమయంలో సరైన నేతను ఎన్నుకోకపోతే ఐదు సంవత్సరాలు నష్టపోవాల్సి ఉంటుందన్నారు. ఇక కర్నూల్లో మంచి నాయకులు అందరూ తమతోనే ఉన్నారని స్పష్టం చేశారు. తమ టిజివి సంస్థల ద్వారా కర్నూల్లోని ప్రతి వార్డులో అభివ్రుద్ది కార్యక్రమాలు చేసినట్లు చెప్పారు. అనంతరం సోమిశెట్టి మాట్లాడుతూ రాష్ట్రాన్ని అభివ్రుద్ది చేయడం చంద్రబాబుతోనే సాధ్యమన్నారు. జగన్ పేరు చెబితేనే ప్రజలు ఛీకొడుతున్నారన్నారు. కర్నూల్లో టిజి భరత్ ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే అభివ్రుద్ది అవుతుందన్నారు. అనంతరం స్థానికులకు అన్న క్యాంటిన్ ద్వారా ఉచితంగా అన్నం పెట్టారు. ఈ కార్యక్రమంలో వార్డు కార్పోరేటర్ విజయకుమారి, వార్డు ఇంచార్జి రామాంజనేయులు, నగర అధ్యక్షుడు గున్నామార్క్, క్లస్టర్ ఇంచార్జి బాబ్జీ, ఇతర వార్డుల కార్పోరేటర్లు, వార్డు ఇంచార్జీలు, క్లస్టర్ ఇంచార్జీలు, తదితర నాయకులు పాల్గొన్నారు. అంతకుముందు మెడికల్ కాలేజీ నుండి త్రీటౌన్ పోలీస్ స్టేషన్ వద్ద ఏర్పాటుచేసిన అన్న క్యాంటిన్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. టిజి భరత్ బైక్ ర్యాలీలో పాల్గొని ప్రజలకు అబివాదం చేస్తూ వచ్చారు.

About Author