PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పాఠశాలలో జాతీయ సమైక్యత ర్యాలీ

1 min read

పల్లెవెలుగు, వెబ్ గడివేముల: జాతీయ సమైక్యత సందేశాన్ని మరియు “ఆజాదీ కా అమృత్ మహొత్సవ్ లో భాగంగా భారతదేశంలో జాతీయ సమైక్యత స్ఫూర్తిని రగిలించిన” ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా సోమవారం నాడు మండలంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో జాతీయ సమైక్యత ర్యాలీ లో భాగంగా ఎంపీడీవో విజయసింహారెడ్డి ఎంఈఓ రామకృష్ణుడు ఇన్చార్జ్ హెచ్ఎం దస్తగిరమ్మ్ ఆధ్వర్యంలో . విద్యార్థులు అధికారులతో జాతీయ సమైక్యతను కాపాడుతామని ప్రతిజ్ఞ చేయించారు అనంతరం విద్యార్థులతో ర్యాలీగా పాత బస్టాండ్ వరకు వెళ్లి త్రీ కే రన్ నిర్వహించారు ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో విజయసింహారెడ్డి ఆధ్వర్యంలో సర్దార్ వల్లభాయ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో. గడిగరేవుల సర్పంచ్ రామ్మోహన్ రెడ్డి గ్రామ సచివాలయ సిబ్బంది పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.

About Author