PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పరిమితికి మించి ప్రయాణం-ప్రాణాలతో చెలగాటం

1 min read

పల్లెవెలుగు, వెబ్ మిడుతూరు : పొట్టకూటి కోసం పనిచేసే కూలీలతో చెలగాటం ఆడుతున్నారు ఆటో డ్రైవర్లు.మిడతూరు మండల కేంద్రం మరియు వివిధ గ్రామాలలో ఉన్న కూలీలు రెక్కడితే గాని డొక్కా ఆడని పరిస్థితి. పనుల కోసం దూర గ్రామాలకు పనులు చేసుకోవడానికి ఆటోలలో వెళ్తున్నారు.ఆటోలలో పరిమితికి మించి కూలీలను తీసుకువెళ్లడం ప్రమాదకరమే అని ఆటో డ్రైవర్లకు తెలిసినా కూడా కూలీల ప్రాణాలతో ఆటోడ్రైవర్లు చెలగాటం ఆడుతున్నారంటూ మండల ప్రజలు అంటున్నారు.ఆటోల పైన,ఆటో వెనుక మరియు మధ్యలో దాదాపు 20 మంది దాకా వెళ్తున్నారు. ఇంతమందిని ఆటోలో ఎక్కించుకున్న ఆటో డ్రైవర్ ఏమాత్రం ఆదమరిస్తే కూలీల ప్రాణాలు అంతే సంగతులేనని చెప్పనవసరం లేదు.ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న ఆటో డ్రైవర్లకు అధికారులు కళ్లెం వేస్తారా..అలాంటి వారి పట్ల అధికారులు తగిన చర్యలు తీసుకుంటారా.. ప్రమాదాలకు అధికారులు ఫుల్ స్టాప్ పెడతారా.. వేచి చూడాల్సిందే.?

About Author