PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

గ్రామ సభలో పంట నమోదు జాబితా ప్రదర్శన

1 min read

పల్లెవెలుగు , వెబ్ గడివేముల: మండలంలోని రైతు భరోసా కేంద్రాలలో గురువారం నాడు గ్రామ సభలు నిర్వహించారు మండల వ్యవసాధికారి ఏం దర్ రెడ్డి అద్వర్యంలో పంట నమోదు యొక్క జాబితాను ప్రదర్శించి వివరాలను అందరికీ చదివి వినిపించారు. దుర్వేసి ,కొరటమద్ది ,తిరుపాడు గడిగరేవుల గ్రామాలలో గ్రామసభలు నిర్వహించి ఖరీఫ్ 2022వ సంవత్సరంలో నమోదైనటువంటి రైతుల జాబితా ,పంట ,,ఖాతా నెంబరు, సర్వే నెంబరు, నీటి సరళి ,వీటన్నిటి పైన కూడా రైతు సోదరులకు అవగాహన కల్పించారు. ఏదైనా ఫిర్యాదులు ఉంటే శుక్రవారం రోజు చివరి తేదీ అని రైతులు ఫిర్యాదు రూపంలో అభ్యంతరాలు తెలియజేస్తే వాటిని ఉన్నతాధికారులు పంపించి సమస్యను పరిష్కరించే దిశగా ప్రయత్నిస్తామని తెలిపారు.

About Author