PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

జిల్లా స్థాయి పోటీలకు విద్యార్థుల ఎంపిక

1 min read

పల్లెవెలుగు, వెబ్ ప్యాపిలి : జిల్లాస్థాయిలో అండర్ 14 మరియు అండర్ 17 విభాగాలలో జరుగబోయే వాలీబాల్ , త్రోబాల్ మరియు అథ్లటిక్స్ లలో పాఠశాలకు చెందిన 35 విద్యార్థులు ఎంపికకావడం సంతోషకరమని, విద్యార్థులు మరింతగా కృషిచేసి రాష్ట్రస్థాయికి ఎంపికకావాలని ఎన్.రాచర్ల ప్రధానోపాధ్యాయులు టి.సురేశ్ బాబు అన్నారు. గతవారం చిన్నమల్కాపురంలో జరిగిన నియోజకవర్గస్థాయి పోటీలలో ప్రతిభచూపి వాలీబాల్ జూనియర్ , సీనియర్ విభాగాలలో బాలురు, బాలికల జట్లు, త్రోబాల్ బాలికలు మరియు రన్నింగ్ , షాట్పుట్ వంటి అథ్లెటిక్స్ లో 35మంది విద్యార్థులు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా శనివారం పాఠశాల ఆవరణలో దీనికి కృషిచేసిన వ్యాయామోపాధ్యాయులు శ్రీనివాసులుకి , విద్యార్థులకు అభినందన కార్యక్రమం నిర్వహించారు. శ్రీనివాసులు ని పాఠశాల తరపున శాలువ,జ్ఞాపిక,పూలమాల మరియు మిఠాయిితో సత్కరించి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విజయలక్ష్మి, తలితకుమారి, సునీల్, జ్యోతి, శేషయ్య,ప్రేమకుమార్, లక్ష్మానాయక్, సుజాత, జీవలత, ప్రకాశ్ బాబు పాల్గొన్నారు.

About Author