PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

యాగంటిలో అఖండ జ్యోతి ఏర్పాట్లు పూర్తి

1 min read

కార్తీక పౌర్ణమి రోజున అఖండ జ్యోతి వెలుగు
జ్యోతి ప్రారంభోత్సవానికి రానున్న టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి

పల్లెవెలుగు, వెబ్ బనగానపల్లె : మండలం ప్రముఖ శైవ క్షేత్రమైన యాగంటిలో కార్తిక పౌర్ణమి రోజున నిర్వహించ తలపెట్టిన అఖండ జ్యోతి నిర్మాణపు పనులు పూర్తయ్యాయి.యాగంటి క్షేత్రానికి ఎగువన పడమటిదిశగా ఎర్రమల గిరులపై అరుణాచలంలో వెలిగే అఖండ జ్యోతిలా అఖండ జ్యోతి వెలిగించేందుకు పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రామభూపాల్ రెడ్డి శ్రీకారం చుట్టారు. యాగంటిలో నిర్వహిస్తున్న శ్రీ ఉమామహేశ్వర నిత్య అన్నదాన సత్రం ఆధ్వర్యంలో దాతల సహకారంతో పెద్ద ఎత్తున ఈ నిర్మాణాన్ని ఆయన చేపట్టారు. కార్తీక పున్నమి రోజున ఐదున్నర గంటల సమయంలో టిటిడి చైర్మన్ వై వి సుబ్బారెడ్డి యాగంటి క్షేత్రానికి వచ్చి ఈ జ్యోతి వెలిగించే కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అదేవిధంగా క్షేత్రంలో ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి ఉచితంగా అందజేసిన స్థలంలో నిర్మించ తలపెట్టిన కళ్యాణ మండపం నిర్మాణం పనులను ఆయన ప్రారంభించనున్నారు. అంతేకాకుండా మొదటిసారిగా టిటిడి ఆధ్వర్యంలో యాగంటిలో కార్తీక పౌర్ణమి రోజున నిర్వహిస్తున్న లక్ష దీపోత్సవ కార్యక్రమంలో కూడా ఆయన పాల్గొంటారు .ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులు, జిల్లాలోని ఎమ్మెల్యేలు ,జిల్లా ఉన్నతాధికారులు పాల్గొననున్నారు.

About Author