PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ప్రభుత్వ ఖాజీలకు సన్మానం

1 min read

పల్లెవెలుగు, వెబ్ నందికొట్కూరు: రాష్ట్ర శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్దార్థ్ రెడ్డి సహకారంతో నందికొట్కూరు పట్టణానికి ప్రభుత్వ ఖాజీలుగా నియమించబడిన ఇబ్రాహీం మౌలానా , జలాల్ మౌలానా లను సోమవారం వైసీపీ నాయకులు ఆర్టీసీ బాబు ఆధ్వర్యంలో మైనార్టీ నాయకులు ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా మైనార్టీ పెద్దలు మాట్లాడుతూ ప్రభుత్వ ఖాజిలుగా నియమించడంలో ఎంతగానో సమన్వయం చేసి ముగ్గురికి ప్రభుత్వ ఖాజి లుగా నియమించటంలో సిద్దార్థ రెడ్డి ఎంతో కృషీ చేశారని అటువంటి నాయకుడూ మనకు తోడుగా ఉండటం మన అదృష్టం అని వారు అన్నారు. మైనారిటీ ప్రజల కోసం ఎంతగానో సేవలందిస్తున్నటువంటి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి నాయకత్వాన్ని బలపరచడానికి మైనార్టీ నాయకులు ప్రజలు ఎంతగానో కృషి చేయాలన్నారు. సిద్ధార్థ నాయకత్వాన్ని బలపరిచే విధంగా ఎన్నో అభ్యున్నతమైన కార్యక్రమాలను చేపట్టాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ ఖాజీలకు శుభాకాంక్షలు తెలియజేశారు. మైనార్టీ ప్రజల సంక్షేమం కోసం అభ్యున్నతి కోసం తోడ్పడాలని కోరారు. ఈ కార్యక్రమంలో 7వ వార్డు కౌన్సిలర్ నాయాబ్, 20వ వార్డు కౌన్సిలర్ హమీద్ మియ్య, 24వ వార్డు కౌన్సిలర్ చాంద్ బాషా, 8వ వార్డు ఇన్చార్జి శాలు భాష , వైఎస్ఆర్సీపీ మైనార్టీ అధ్యక్షులు అబూబక్కర్, కిరాణం మర్చంట్ అసోసియేషన్ నాయకులు మన్సూర్ భాష , మంజు సలామ్, మాజీ కౌన్సిలర్ జబ్బార్, గోల్డ్ షాప్ అల్తాఫ్, అబ్దుల్లా, రాకిల్, ముస్లిం మైనారిటీ నాయకుడు సలాం భాష, మరియు ముస్లిం మైనారిటీ యూత్ నాయకులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

About Author