నారాలోకేష్ను కలిసిన టి.జి. భరత్
1 min read

పల్లెవెలుగు వెబ్: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను బుధవారం కర్నూలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జి టి.జి భరత్ మర్యాదపూర్వకంగా కలిశారు. విజయవాడలో పార్టీ యువనేతలతో ఆయన.. నారాలోకేష్కు పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం నారాలోకేష్ త్వరలో చేపట్టబోయే పాదయాత్ర గురించి చర్చించారు. ఈ సందర్భంగా పలు సలహాలు, సూచనలు నారాలోకేష్కు ఇచ్చినట్లు టీజీ భరత్ పేర్కొన్నారు. ఆ తరువాత పార్టీ అధినేత చంద్రబాబు నాయుడును కలిశారు.


