PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

‘రంజాన్​’ను ప్రశాంతంగా జరుపుకోండి..

1 min read

– సీఐ మహమ్మద్ అలీ
పల్లెవెలుగు వెబ్​, చెన్నూరు: రంజాన్ పండుగ పర్వదినాన్ని ముస్లిం సోదరులు తమ కుటుంబ సభ్యులతో సంతోషంగా జరుపుకోవాలని సీఐ మహమ్మద్ అలీ అన్నారు. గురువారం స్థానిక పోలీస్​ స్టేషన్లో ముస్లిం మత పెద్దలతో సమావేశం నిర్వహించారు. ముందుగా ముస్లిం సోదరులకు రంజాన్​ శుభాకాంక్షలు తెలిపారు. కరోనా సెకండ్​ వేవ్​ విజృంభిస్తున్న నేపథ్యంలో కోవిడ్​ నిబంధనలు పాటిస్తూ పండగను జరుపుకోవాలని సూచించారు. సమైక్యతతో సామాజిక దూరం పాటిస్తూ, సంతోషంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు. కోవిడ్​ నిబంధనలు పాటిస్తూ ప్రార్థనలు చేసుకునేలా చూడాలని ముస్లిం మత పెద్దలను సీఐ మహమ్మద్ ఆలీ కోరారు. కార్యక్రమంలో ఎస్ఐ బి. శ్రీనివాసులు, చెన్నూరు ముస్లిం మత పెద్దలు పాల్గొన్నారు.

About Author