PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

క్రీడలు ఐక్యతకు సంకేతం : ప్రిన్సిపాల్

1 min read

– క్రీడాకారులను పరిచయం చేసుకుంటున్న తాజుద్దీన్
పల్లెవెలుగు వెబ్ ఆత్మకూరు: విద్యార్థులు, యువత, చెడు మార్గాల జోలికి వెళ్లకుండా ఉండాలంటే క్రీడలను ప్రోత్సహించాలని , ఐక్యతకు సాంకేతికమని పెద్ద కబేలాలోని చైతన్య స్కూల్ ప్రిన్సిపాల్ తాజుద్దీన్ అన్నారు. హై స్కూల్ గ్రౌండ్ లోశ్రీ బుడ్డా వెంగళ రెడ్డి మెమోరియల్ ట్రోఫీ క్రికెట్ పోటీలు మాజీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రారంభించారు. అందులో భాగంగా గురువారం రెండు టీంలను పరిచయం చేసుకొని టాస్ వేసి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలకు యువత ప్రాధాన్యత ఇవ్వడం కారణంగా తదితర మత్తు పదార్థాలకు దూరంగా ఉంటారన్నారు. ప్రాథమిక విద్య నుంచే ప్రాథమిక పాఠశాలలోనే క్రీడలకు ప్రాధాన్యతనిచ్చి ప్రోత్సహించాలన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు షాబుద్దీన్, అజ్ముద్దీన్ తో పాటు క్రీడాకారులు పాల్గొన్నారు.

About Author