PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

చింతలపల్లిలో అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణ

1 min read

– త్రాగునీటి ట్యాంకుల ప్రారంభోత్సవం
పల్లెవెలుగు వెబ్ మిడుతూరు: మండల పరిధిలోని చింతలపల్లి గ్రామంలో శుక్రవారం సాయంత్రం భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని గ్రామ సర్పంచ్ జి.రవణమ్మ,మాజీ సర్పంచ్ వెంకటేశ్వర రెడ్డిల ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు.అంతేకాకుండా గ్రామంలో ఉన్న నీటి సమస్యను తీర్చడానికి గాను నూతనంగా చేపట్టిన మూడు త్రాగునీటి ట్యాంకులను వారు ప్రారంభించారు. ముందుగా గ్రామానికి వచ్చిన టిడిపి మండల కన్వీనర్ కాతా రమేష్ రెడ్డి,ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి. జయసూర్య మరియు తదితర టీడీపీ నాయకులకు వెంకటేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మేళతాళాల నడుమ స్వాగతం పలికారు.ఈకార్యక్రమంలో మాజీ ఎంపీపీ గుండం నాగేశ్వర రెడ్డి,నాగిరెడ్డి,వై.రంగారెడ్డి,సంపంగి రవీంద్రబాబు,సుధాకర్ రెడ్డి,ఇద్రిస్ తదితర టిడిపి నాయకులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.

About Author