PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సంక్షేమ పథకాలతోనే ప్రజలకు మేలు

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యే హాఫిజ్ ఖాన్ గారికి ఘనంగా స్వాగతం పలికిన స్థానిక నాయకులు, మరియు విధి ప్రజలు సంక్షేమ పథకాలతో మనకు ఆదుకుంటున్న మన ప్రియతమ నేత ప్రజల నాయకుడు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వై.యస్ జగన్ మోహన్ రెడ్డి గారికి ఆశీర్వదిస్తూ తోడుగా నిలుస్తాం గడప గడప కు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న కర్నూల్ ఎమ్మెల్యే హాఫిజ్ ఖాన్ గారు జగనన్న పాలనలోనే ప్రతి గడప వద్దకు సంక్షేమం నడుచుకుంటూ వస్తోందని కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ గారు అన్నారు. కర్నూలు నగరంలోని 10వ వార్డు 24,25వ సచివాలయం లాల్ మస్జీద్, చేపల సందు,మసుమ్ భాష దర్గా,పరిధిలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ఆయన నిర్వహించారు.ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ వైఎస్. జగన్ మోహన్ రెడ్డి గారు పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా అందరికి మంచి చెయ్యాలనే ఆలోచనతో సంక్షేమ పథకాలు అందిస్తున్నారన్నారు. ప్రతి ఇంటికి కూడా సంక్షేమ పథకాలు అందుతున్నాయని, ప్రజలు సంతోషాన్ని కలిగించిందన్నారు. ఎవరైనా అర్హత ఉండి సంక్షేమ పథకాలు రాకపోతే వారికీ ఇప్పించే బాధ్యత నాదని హామీ ఇచ్చారు. స్థానిక నాయకులు 10వ వార్డు కార్పొరేటర్ యూనుస్ బాషా, డాక్టర్ రేహన్ అలీ ఖాన్, పర్వేజ్ ఖాన్, నజీర్ అలీఖాన్, నూరుల్లాహ్ ఖాద్రి సాహెబ్, సోహైల్ బాబా,షబ్బీర్ ఖాన్ స్థానిక వార్డు నాయ కులు మెప్మా ఆర్పి సచివాలయం సిబ్బంది విద్యుత్ సిబ్బంది మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది పాల్గొన్నారు.

About Author