PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

టిడిపిని బలోపేతం చేద్దాం : టిజి భరత్

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: కర్నూలులో తెలుగుదేశం పార్టీని క్షేత్ర స్థాయిలో బలోపేతం చేసేందుకు అందరం కష్టపడాలని కర్నూల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంఛార్జీ టిజి భరత్ అన్నారు. గురువారం నగరంలోని చిత్తారివీధికి చెందిన షేక్ మెహబూబ్ బాషా ఆధ్వర్యంలో యువత తెలుగుదేశం పార్టీలో చేరారు. వీరికి టిజి భరత్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం 6వ వార్డుకు చెందిన బిల్డర్లు చాంద్ బాషా, అబ్దుల్లా ఆధ్వర్యంలో స్థానికులు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా టిజి భరత్ మాట్లాడుతూ రానున్న ఎన్నికలలో టిడిపి అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందన్నారు. అభివృద్ధి చేసేది ఎవరో ప్రజలు ఆలోచించాలని చెప్పారు. వార్డుల్లో ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని నేతలకు సూచించారు. తాను ఎమ్మెల్యే అయితే కర్నూలుకు పరిశ్రమలు తెచ్చేందుకు కృషి చేస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో నేతలు ఇబ్రహీం, మెహబూబ్, అంజాద్ బాషా, సికిందర్, తదితరులు పాల్గొన్నారు.

About Author