PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వృత్రి పన్ను పై ఆందోళన వద్దు

1 min read

– APUWJ డిమాండ్ తో కమర్షియల్ టాక్స్ ప్రిన్సిపాల్ సెక్రటరీ తో మాట్లాడిన సమాచార శాఖ కమిషనర్…
– ఆందోళన వద్దు.. గిరిజ శంకర్..
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: ఆంధ్రప్రదేశ్ లో అక్రిడేషన్ కలిగిన జర్నలిస్టుల కి ఇటీవల కాలంలో కమర్షియల్ టాక్స్ కార్యాలయం నుండి జర్నలిస్టులు వృత్తి పన్ను కట్టాలని నోటీసులు ఇచ్చారు..ప్రతి జర్నలిస్ట్ సంవత్సరానికి 2500 చొప్పున 5 సంవత్సరాలది 12500 రూపాయలు చెల్లించాలి ని నోటీసులు జారీ చేశారు..ఈనేపథ్యంలో IJU ఉపాధ్యక్షుడు అంబటి అంజనేయులు, APUWJ రాష్ట్ర అధ్యక్షుడు ఐవి సుబ్బారావు, ప్రధాన కార్యదర్శి చందు జనార్దన్.. ఎల్ట్రానిక్ మీడియా రాష్ట్ర అధ్యక్షుడు యేచూరి శివ,రాష్ట్ర నాయకులు నాగరాజు..గుంటూరు జిల్లా అధ్యక్షుడు sn మీరా లు వెంటనే రద్దు చెయ్యాలని సమాచారం శాఖ కమిషనర్ ని గురువారం కలిసి వినతిపత్రం అందజేశారు…వెంటనే స్పందించిన కమిషన్ వాణిజ్య పన్నుల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గిరిజ శంకర్ తో ఫోన్ మాట్లాడి వృత్తి పన్ను నిలిపివేలని కోరారు…దీనిపై ఆందోళన వద్ద ని గిరిజ శంకర్ భరోసా ఇచ్చారు.

About Author