PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

జగనన్నను మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకుందాం

1 min read

– మళ్ళీ సంక్షేమ పథకాలు తీసుకుందాం
– గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం లో కర్నూలు ఎమ్మెల్యే హాఫిజ్ ఖాన్
పల్లెవెలెగు వెబ్ కర్నూలు: ప్రతి ఇంటికీ సంక్షేమ పథ కాలు అందించిన జగనన్నను వచ్చే ఎన్నికల్లో మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకుందామని కర్నూలు ఎమ్మెల్యే హాఫిజ్ ఖాన్ గారు అన్నారు. శనివారం సాయంత్రం కర్నూలు నగరం లోని 07వ వార్డ్ 18వ సచివాలయం 1టౌన్ ఏరియా మేధార్ గేరి పరిధిలోని లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యేకు స్థానిక వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పూలమాలలు వేసి ఘనంగా స్వాగత పలికారు. అనంతరం ఎమ్మెల్యే ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు తీరు ఎలా ఉందని ప్రజలను అడిగి తెలుసుకున్నారు. సంక్షేమ పథకాల బుక్లెట్ను లబ్ధిదారులకు అందజేశారు 74 ఏళ్ల గణతంత్ర భారతంలో పేదలకు రాజ్యాంగ ఫలాలు అందించిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారికే సొంతమన్నారు. రాజ్యాంగ స్ఫూర్తితో మహిళా రిజర్వేషన్లు, మహిళా చట్టాలు, పేదలకు సంక్షేమ పథకాలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్లు ఏర్పాటు చేశారని తెలిపారు. అందరికీ అందుబాటులోకి విద్యా, వైద్యం తీసుకొచ్చిన ఘనత జగనన్నకే సాధ్యమైందన్నారు. వచ్చే ఎన్ని కల్లో సంక్షేమ, అభివృద్ధికే ప్రజలు పట్టం కడతారని, ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు పన్నినా జనం వారికి తగిన బుద్ధి చెబుతారన్నారు. కార్యక్రమంలో సచివాలయ కన్వీనర్లు స్థానిక వార్డు కార్పొరేటర్ జుబైర్ అహ్మద్ గారు, వైస్సార్సీపీ నాయకులు నవీద్ పర్వీజ్ గారు,షౌ్యైబ్ గారు,అన్వార్ గారు, నజీర్ గారు, ఖలీల్ గారు,లతీఫ్ గారు,మరియు వైస్సార్సీపీ ముఖ్య నాయకులు,ఎ.ఈ రచయ్య గారు , జగదీశ్ , మెప్మా ఆర్ పి & OB’s సచివాలయం సిబ్బంది విద్యుత్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

About Author