PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతం

1 min read

పల్లెవెలుగు వెబ్ చెన్నూరు : పెన్నా నది ఒడ్డున ఆంజనేయపురం గ్రామంలో ప్రసన్న ఆంజనేయ స్వామి ఆలయం ఎదురుగా సత్యనారాయణ స్వామి ఆలయం వద్ద ఆదివారం మాఘ పౌర్ణమి పురస్కరించుకొని చెన్నూరు కు చెందిన ఆలయ కమిటీ నిర్వాహకులు సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతం ఏర్పాటు చేయడంతో ఈ వ్రతంలో చెన్నూరు కాజీపేట మండలాలకు చెందిన 300 మంది దంపతులు సత్యనారాయణ స్వామి వ్రతంలో పాల్గొన్నారు. వేద పండితుడు గిరి స్వామి దంపతులు చేతులు మీదుగా సామూహిక ఉచిత సత్యనారాయణ వ్రతం వైభవంగా నిర్వహించారు. తెల్లవారుజామున ఐదు గంటలకు ఆలయంలో మూలమూర్తులకు సుప్రభాత సేవ అభిషేక పూజలు నిర్వహించారు.9 గంటల నుంచి 12 గంటల వరకు ఆలయం ఆవరణము ఎదుట సత్యనారాయణ వ్రతం నిర్వహించారు. సత్యనారాయణ స్వామి వ్రతం లో పాల్గొన్న దంపతులకు ఆలయాన్ని సందర్శించిన భక్తులకు కమిటీ నిర్వాహకులు తీర్థ ప్రసాదాలతో పాటు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.

About Author