PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వైసీపీ సోషల్ మీడియా కో కన్వీనర్గా బ్రహ్మయ్య ఆచారి

1 min read

పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: నందికొట్కూరు నియోజకవర్గం వైసిపి సోషల్ మీడియా కో కన్వీనర్ గా నందికొట్కూరు పట్టణంలోని బీఆర్ఆర్ నగర్ కు చెందిన బ్రహ్మయ్య ఆచారి ని నియమిస్తూ వైసీపీ ప్రభుత్వం శనివారం ఆదేశాలు జారీ చేశారు. వైసీపీలో నిబద్ధత గల కార్యకర్తగా రాష్ట్ర శాప్ చైర్మన్ వైసీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు బైరెడ్డి సిద్దార్థ రెడ్డి వీరాభిమానిగా ,నందికొట్కూరు మున్సిపల్ చైర్మన్ దాసి సుధాకర్ రెడ్డి ముఖ్య అనుచరుడుగా గుర్తింపు పొందిన బ్రహ్మయ్య ఆచారి సోషల్ మీడియా కో కన్వీనర్ గా నియమించటం పట్ల వైసీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు. ఈయన సతీమణి కృష్ణవేణి నందికొట్కూరు మున్సిపాలిటీ 15వ వార్డు కౌన్సిలరు గా గెలుపొందారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి పేదలకు అందే విదంగా కృషి చేస్తానని తెలిపారు.2024లో వైసీపీ గెలుపే ద్వేయంగా కష్టపడుతామన్నారు.

About Author