PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఎమ్మెల్సీ ఎన్నికల్లో వెన్నుపూస రవింద్రా రెడ్డి ని గెలిపించండి

1 min read

పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: నందికొట్కూరు పట్టణంలోని బసిరెడ్డి డిగ్రీ కాలేజ్ నందు మున్సిపల్ చైర్మన్ దాసి సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో బుధవారం ఎమ్మెల్సీ ఎన్నికల పై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా చైర్మన్ సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో ప్రజా సంక్షేమ పాలన అద్భుతంగా జరుగుతుందని అన్నారు.రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షులు, శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఆదేశాల మేరకు ఎమ్మెల్సీ అభ్యర్థి వెన్నుపూస రవింద్రా రెడ్డి కి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ఉపాధ్యాయులకు పిలుపునిచ్చారు. పుల్యాల రామచంద్రా రెడ్డి మాట్లాడుతూ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి నాయకత్వంలో నందికొట్కూరు అభివృద్ధి కోసం ఎమ్మెల్సీ అభ్యర్థి వెన్నుపూస రవింద్రా రెడ్డి కి మొదటి ప్రాధాన్యత ఓటు ను వేసి, వేయించాలని ఉపాధ్యాయులకు సూచించారు. అదే విధంగా కాలేజ్ సిబ్బంది అందరూ సహకారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బసిరెడ్డి డిగ్రీ కళాశాల చైర్మన్ సూదిరెడ్డి శ్రీధర్ రెడ్డి , కరస్పాండెంట్ వి.నాగ సత్యనారాయణ , ఆర్.సి రెడ్డి విద్యా సంస్థల అధినేత పుల్యాల రామచంద్రా రెడ్డి , బసిరెడ్డి డిగ్రీ కాలేజ్ డైరెక్టర్ సూదిరెడ్డి రమేష్ రెడ్డి , కౌన్సిలర్ కొండ్రెడ్డి విజయమ్మ , లాలు ప్రసాద్ , వార్డు ఇంచార్జ్ రజిని కుమార్ రెడ్డి, శ్రీ నంది జూనియర్ కాలేజ్ ప్రిన్సిపాల్ బద్దుల శ్రీకాంత్ , బసిరెడ్డి డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ జాన్ ఎలీషా బాబు , నందికొట్కూరు వైసిపి కన్వీనర్ అబుబక్కర్ , ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

About Author