PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఐటి విభాగం జిల్లా అధ్యక్షులుగా జగన్ మోహన్ రెడ్డి

1 min read

– పార్టీ అభివృద్ధికి కృషి చేస్తా -నాకు ఇచ్చిన అవకాశాన్ని పార్టీకి ఉపయోగిస్తా : జగన్
పల్లెవెలుగు వెబ్ మిడుతూరు: మిడుతూరు మండల పరిధిలోని 49బన్నూరు వైఎస్ఆర్సిపి నాయకులు రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షులు &శాప్ చైర్మన్,నందికొట్కూరు వైఎస్ఆర్సిపి నియోజకవర్గ ఇన్చార్జి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ముఖ్య అనుచరుడు ఎస్.జగన్ మోహన్ రెడ్డికి నంద్యాల జిల్లా వైఎస్ఆర్సిపి సమాచార సాంకేతిక విభాగం జిల్లా అధ్యక్షులు(ఐటి విభాగం)పదవి వరించింది.గురువారం పార్టీ అనుబంధ విభాగాల రాష్ట్ర కోఆర్డినేటర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నంద్యాల జిల్లాలోని వివిధ నియోజకవర్గాలలో మొత్తం 20 మందిని జిల్లా బాధ్యతలు అప్పగించిన జాబితాను ఆయన రాష్ట్ర పార్టీ కార్యాలయంలో విడుదల చేశారు.నాకు నంద్యాల జిల్లా బాధ్యతలు అప్పగించినటువంటి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారికి అదేవిధంగా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అన్నకు కృతజ్ఞతలు తెలియజేశారు.నామీద ఎంతో నమ్మకంతో ఇచ్చిన పదవిని సద్వినియోగం చేసుకుంటూ పార్టీకి ఉపయోగిస్తానని అంతేకాకుండా వచ్చే ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి కృషి చేస్తానని ఐటీ విభాగం జిల్లా అధ్యక్షులు ఎస్.జగన్ మోహన్ రెడ్డి అన్నారు.

About Author