PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

గుండెపోటుతో వాలంటీర్ మృతి

1 min read

పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: జూపాడుబంగ్లా మండల కేంద్రంలో బుధవారం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. గ్రామ 1వ సచివాలయ వాలంటీర్ గా విధులు నిర్వహిస్తున్న షేక్ రియాజుద్దీన్ బుధవారం తెల్లవారుజామున గుండెపోటుతో ఆకస్మికంగా మృతిచెందారు. కుటుంబ సభ్యుల కథనం మేరకు బుధవారం తెల్లవారుజామున గుండెపోటు రావడంతో చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో రియాజ్ తుదిశ్వాస విడిచారు.రియాజ్ మృతితో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఇటీవలే ఆయన వాలంటీర్ల సంఘ కార్యదర్శిగా ఎన్నికయ్యారు. పిన్న వయసులోనే రియాజ్ మృతి చాలా బాధాకరమని సచివాలయ వాలంటీర్ సంఘ అధ్యక్షుడు శ్రీకాంత్ యాదవ్ , సహచర వాలంటీర్లు ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ సంతాపం వెలిబుచ్చారు.జూపాడు బంగ్లా వాలంటీర్స్ అసోసియేషన్ తరుపున వాలంటీరీలు రియాజ్ కుటుంబానికి రూ.31 వేలు ఆర్ధిక సహాయం చేశారు. ఈ కార్యక్రమంలో మా భాష , రాజన్న, నాగారాజు , నూర్ భాష , పవన్ కుమార్, జయశంకర్, రాజన్న, రవి, అబ్దుల్లా , వాలంటరీలు పాల్గొన్నారు.

About Author