PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అమ్మా… నాన్నను చంపేశాను..!

1 min read

– సైకో కొడుకు కిరాతకం
– భార్య కాపురానికి రావడం లేదని
– కన్నతండ్రిని ఇనుపరాడ్ తో కొట్టి చంపిన కొడుకు
– అర్ధరాత్రి పడమర ప్రాతకోటలో హత్య ఘటన
– ముచ్చుమర్రి పొలీస్ స్టేషన్ లో లొంగిపోయిన హంతకుడు
పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు : కన్న తండ్రిని అతికిరాతకంగా కొడుకు హత్య చేసిన దారుణ సంఘటన పగిడ్యాల మండలం పడమర ప్రాతకోట గ్రామంలో బుధవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన పల్లె వెంకటేశ్వర్లు(50)ను కొడుకు శ్రీకాంత్ ఇనుపరాడ్ తో కొట్టి చంపేశాడు. అనంతరం పోలీసు స్టేషన్ లో లొంగిపోయాడు. కుటుంబ సభ్యులు గ్రామస్తుల కథనం మేరకు పల్లె వెంకటేశ్వర్లు రమణమ్మ దంపతులకు ముగ్గురు సంతానం. ఇద్దరు కొడుకులు ఒక కుమార్తె ఉన్నారు. పెద్ద కుమారుడు శ్రీకాంత్ బైక్ మెకానిక్. శ్రీకాంత్ కు జూపాడుబంగ్లా మండలం పారుమంచాల గ్రామానికి చెందిన యువతితో ఆరు ఏళ్ల క్రితం వివాహామైంది.వీరికి ఇద్దరు పిల్లలు.సజావుగా సాగుతున్న వీరి సంసారంలో కలతలురేగాయి.భార్య భర్తల తరచు గొడవలు పడ్డారు. గత కొంతకాలంగా భార్య పుట్టింట్లోనే ఉంది. సంసారానికి రాకపోవడంతో శ్రీకాంత్ తల్లిదండ్రులపై కోపం పెంచుకున్నాడు. ఈ నేపధ్యంలోనే బుధవారం రాత్రి తండ్రి వెంకటేశ్వర్లు తో గోడవపడ్డాడు.ఆవేశంతో విచక్షణ కోల్పోయాడు.అర్ధరాత్రి ఇంట్లో నిద్రిస్తున్న తండ్రిని బైక్ రాడ్ తీసుకొని తండ్రి తలపై బలంగా బాదాడు. ఓకే దెబ్బతో తండ్రి నెలకొరిగాడు.తల పగిలి గిలాగిలా కొట్టుకుంటూ ప్రాణాలు కోల్పోయాడు.తండ్రీ చనిపోలేదని మరోసారి తల మీద కొట్టాడు.తండ్రి చనిపోయాడని గ్రహించి తల్లి వద్దకు వెళ్లి అమ్మా.. నాన్న ను చంపేశాను.. వెళ్లి చూడు అని తల్లి రమణమ్మ కు చెప్పాడు.కుటుంబ సభ్యులు, బంధువులు వెళ్లి చూడగా వెంకటేశ్వర్లు రక్తపుమడుగులో పడి ఉన్నాడు. ముచ్చుమర్రి పోలీసులకు సమాచారం అందించారు. కోన ఉపిరితో ఉన్నదేమోనన్న ఆశతో నందికొట్కూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అప్పటికే వెంకటేశ్వర్లు మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. నేరాన్ని ఒప్పుకుంటూ శ్రీకాంత్ ముచ్చుమర్రి పోలీసు స్టేషన్ లో లొంగిపోయాడు. కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

About Author