‘కొండూరు వారి’ వివాహ వేడుకలో చమర్తి జగన్ మోహన్ రాజు
1 min read

పల్లెవెలుగువెబ్, అన్నమయ్య జిల్లా:అన్నమయ్య జిల్లా రాజంపేట నియోజకవర్గంలో ,వీరబల్లి మండలం, ఓదివీడు గ్రామ పంచాయతీ గంగరాజుగారి పల్లి కి చెందిన దివంగత మాజీ సర్పంచ్ పిచ్చిరాజు మనువడు రామమోహన్ రాజు సరస్వతమ్మ దంపతుల కుమారుడు శ్రావణ్ కుమార్ రాజు వివాహ వేడుకలలో గురువారం టి డి పి నేత చమర్తి జగన్ మోహన్ రాజు హాజరయ్యారు. రాయచోటి పట్టణం లో రాజధాని కళ్యాణ మండపం నందు నూతన వధూ వరులకు పసుపు పచ్చని అక్షింతలు వేసి ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు మరియు బంధుమిత్రులు తదితరులు పాల్గొన్నారు.

