PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఇది ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమం కాదు

1 min read

– హక్కుల కోసం న్యాయపోరాటం
– ఏ పి జే ఏ సీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు
పల్లెవెలుగు వెబ్ అన్నమయ్య జిల్లా రాయచోటి: తాము చేస్తోంది ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమం కాదని.. హక్కుల కోసం చేస్తోన్న న్యాయపోరాటమని ఏపీ జేఏసీ ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు పేర్కొన్నారు..అన్నమయ్య జిల్లా రాయచోటి లోని శ్రీ సాయి ఇంజనీరింగ్ కళాశాల ఆవరణంలో ఏర్పాటుచేసినఉద్యోగ సంఘాల నాయకుల సమావేశంలో మాట్లాడుతూ ఈ ఉద్యమానికి అనవసర అపవాదులు అంటించవద్దని కోరారు. కడపలో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వంలోని కుటుంబసభ్యులైన ఉద్యోగులు సంతోషంగా ఉంటేనే, ప్రభుత్వ సంక్షేమ పథకాలను అమలు చేస్తారని అన్నారు. తమ వెనుక ఏ శక్తులు ఉండి నడిపించడం లేదని.. ప్రభుత్వ భాద్యతలను గుర్తు చేసేందుకే ఈ ఉద్యమం చేపడుతున్నామని స్పష్టం చేశారు. ఈ ఉద్యమంలోకి రావాలని ఏపీ ఎన్జీఓతో జేఏసీ ఆరు నెలలుగా ప్రయత్నం చేశామని, సమావేశం ఏర్పాటు చేసుకుని వస్తామని చెప్పారని వెల్లడించారు. 10 నుంచి 5 వరకు పని చేస్తామని, ఇందుకు అధికారులు సహకరించాలని కోరామని తెలిపారు. ముందుగా ప్రకటించిన మేరకు ఉద్యమ కార్యాచరణ ఉంటుందని క్లారిటీ ఇచ్చారు. అప్పటికీ దిగిరాకపోతే.. ఏప్రిల్ 5న మలిదశ ఉద్యమంపై ఆలోచిస్తామన్నారు ఈకార్యక్రమంలో ప్రభుత్వ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు .

About Author