PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అభివృద్ధి అంటే వైసీపీ తోనే సాధ్యం

1 min read

– చౌటుకూరులో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో జడ్పీటీసీ
పల్లెవెలుగు వెబ్ మిడుతూరు: మిడుతూరు మండల పరిధిలోని చౌటుకూరు గ్రామంలో ఆదివారం సాయంత్రం జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మిడుతూరు మండల జడ్పిటిసి పర్వత యుగంధర్ రెడ్డి మరియు సహకార సొసైటీ చైర్మన్ టి.నాగ తులసి రెడ్డి,వైసిపి మండల కన్వీనర్ తువ్వా లోకేశ్వర రెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొని వైఎస్సార్సీపీ అభ్యర్థి బలపరిచిన వెన్నపూస రవీంద్రారెడ్డిని గెలిపించాలని వారు ఓటర్లను అభ్యర్థించారు.ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి ఇల్లు లబ్ధి చేకూరాయని అంతేకాకుండా పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్క సంక్షేమ పథకాన్ని లబ్ధిదారులకు చేరవేయడం జరిగిందని వారు అన్నారు.రాష్ట్ర అభివృద్ధి జరగాలంటే వైయస్ఆర్సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి వెన్నపూస రవీంద్రా రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని వారు పట్టభద్రులను కోరారు.ఈకార్యక్రమంలో తువ్వా రామ నాగేశ్వర రెడ్డి,కలమందలపాడు మహబూబ్ బాష, చిన్న ఎల్లారెడ్డి,కమతం ఎల్లారెడ్డి,గ్రామ వైసీపీ నాయకులు గోపాల్ రెడ్డి,బోయ వెంకటేశ్వర్లు,రోలుబొట్టు వెంకటేశ్వర్లు,చిన్న బాల మద్దిలేటి,రాజేష్,చిన్న దస్తగిరి,బి మోహన్ తదితరులు పాల్గొన్నారు.

About Author